Ap News: టీడీపీలోకి భారీగా చేరికలు

by srinivas |   ( Updated:2023-01-05 12:04:07.0  )
Ap News: టీడీపీలోకి భారీగా చేరికలు
X

దిశ, అన్నవరం : కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం రమణయ్య పేటలో వందమంది గిరిజనులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి టీడీపీలో చేరారు. నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ వరుపుల రాజా వీరందరికి పార్టీ కండువాలు వేసి టీడీపీలోకి ఆహ్వానించారు. వరుపుల రాజా నాయకత్వంపై నమ్మకంతో టీడీపీలో చేరుతున్నట్లు వారంతా ప్రకటించారు. రాజాను ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీతో గెలిపించుకొంటామని తెలిపారు.


ఈ సందర్భంగా రాజా మాట్లాడుతూ రోజు రోజుకి టీడీపీకి ఆదరణ పెరుగుతుందన్నారు. నియోజకవర్గంలో చాలా గ్రామాల్లో ప్రజలు టీడీపీలో చేరడానికి ఆసక్తి చూపుతున్నారన్నారు. కొత్తగా వచ్చే వారిని గౌరవిస్తూ అందరూ కలిసి మెలిసి పార్టీ కోసం పని చేయాలన్నారు. గిరిజన సోదరులు పార్టీలో చేరడం అత్యంత సంతోషమని వారందరికీ హృదయ పూర్వకంగా ఆహ్వానం పలుకుతున్నామన్నారు. అందరూ పార్టీ విజయం కోసం పని చేయాలని రాజా కోరారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed