AP Politics:జనసేన ఫ్లెక్సీలు ధ్వంసం చేసిన దుండగులు

by Jakkula Mamatha |
AP Politics:జనసేన ఫ్లెక్సీలు ధ్వంసం చేసిన దుండగులు
X

దిశ,దేవరపల్లి: తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలం కృష్టంపాలెంలో రాష్ట్ర అసెంబ్లీలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రమాణస్వీకారం సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. ఈ విషయం తెలుసుకున్న జనసేన పార్టీ ఇంచార్జ్ దొడ్డి గార్ల సువర్ణ రాజు కృష్ణం పాలెం, గోపాలపురం జన సైనికులతో సంఘటన ప్రాంతానికి చేరుకున్నారు.ఫ్లెక్సీలను ధ్వంసం చేసిన నిందితులను వెంటనే శిక్షించాలని నిరసన వ్యక్తం చేశారు. జన సైనికులు సంయమనం పాటించాలని రాష్ట్రం అప్పులతో అధోగతి పాలయి ఉందని రాష్ట్రాన్ని బాగు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ సమయంలో చర్యకు ప్రతి చర్య కరెక్ట్ కాదని హింసకు తావు లేదన్నారు. దోషులను చట్ట ప్రకారం శిక్షించాలనే తప్ప జన సైనికులు ఎవరు ఆవేశపడవద్దని ఆయన సూచించారు.



Next Story

Most Viewed