- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
Kakinada: పిఠాపురంలో జనసేనకు షాక్.. మాజీ ఇంఛార్జి శేషు కుమారి రాజీనామా

దిశ, వెబ్ డెస్క్: కాకినాడ జిల్లా పిఠాపురంలో జనసేన పార్టీకి షాక్ తగిలించింది. పిఠాపురం మాజీ ఇంచార్జి మాకినీడు శేషుకుమారి ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. జనసేన పార్టీలో సీనియర్ నాయకురాలిగా ఉన్న ఆమె 2014 ఎన్నికల్లో పిఠాపురం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అయితే మూడు నెలల క్రితం ఆమెను జనసేన అధిష్టానం పార్టీ ఇంచార్జి పదవి నుంచి తొలగించింది. దీంతో మనస్థాపం చెందిన శేషుకుమారి జనసేనకు రాజీనామా చేసినట్లు వెల్లడించారు. ఏ పార్టీలో చేరతారనే విషయం త్వరలో చెబుతానని ఆమె తెలిపారు.
అయితే జనసేన పార్టీ కోసం మాకినీడు శేషుకుమారి తీవ్రంగా కృషి చేశారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే పవన్ కల్యాణ్కు ఒక్క అవకాశం ఇవ్వాలంటూ ఆమె ప్రజలను కోరారు. వచ్చే ఎన్నికల్లో గ్లాసు గ్లాజు గుర్తుకు ఓటు వేసి పవన్ కల్యాణ్ను సీఎం చేయాలని పిఠాపురంలో ప్రతి ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు. కానీ ఇటీవల పార్టీలో జరుగుతున్న పరిణామాలతో శేషుకుమారి జనసేనను వీడాల్సి వచ్చింది.