తూర్పుపై గట్టిగా తుఫాను ప్రభావం.. గగ్గోలు పెడుతున్న రైతులు

by srinivas |
తూర్పుపై గట్టిగా తుఫాను ప్రభావం.. గగ్గోలు పెడుతున్న రైతులు
X

దిశ, ( ఉభయ గోదావరి ప్రతినిది): ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో తుఫాను ప్రభావం గట్టిగా పడింది. జిల్లాలో ధాన్యం రాసులు నీట మునిగిపోయాయి. ధాన్యం రంగు మారడంతో కొనే నాదుడు లేక రైతులు గగ్గోలు పెడుతున్నారు. రహదారులు జలమయమయ్యాయి. రాకపోకలు స్థంబించాయి. ముమ్మడివరంలో ప్రధాన రహదారిపై పూర్తిగా రాకపోకలు బంద్ అయ్యాయి. పాఠశాలకు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. మిల్లర్ల నుంచి సంచులు రాకపోవడంతో రైతులు తమ ధాన్యాన్ని కల్లాల్లోనే ఉంచారు. దీంతో ధాన్యం అంతా నీళ్ల పాలైంది. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని రైతులు డిమాండు చేస్తున్నారు.

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో దారుణం

జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జన జీవనం స్థంబించింది. రాకపోకలు నిలిచి పోయాయి. రహదారులపై నీళ్లు నిలిచిపోయాయి. ఉప్పాడ బీచ్ వద్ద సముద్రం ఉగ్ర రూపం దాల్చింది. కెరటాలు ఉవ్వెత్తున ఎగిసి పడటంతో తీర ప్రాంత వాసులు కంగారు పడుతున్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లకుండా ఇళ్ల వద్దనే ఉండిపోయారు.

నీట మునిగిన ముమ్మడివరం

గౌతమీ గోదావరి, వశిష్ట గోదావరి చెంతన ఉన్న ముమ్మిడివరం పూర్తిగా నీట మునిగింది. ప్రధాన రహదారి జలమయం అయింది. కొబ్బరి తోటలు వరి పంటలు పూర్తిగా నీట మునిగాయి. దీంతో జనం ఇబ్బందులపాలయ్యారు.

మంత్రి వేణు పర్యటన

మంత్రి వేణు గోపాలకృష్ణ రామచంద్రపురం నియోజకవర్గంలో పర్యటించారు. తడిసిన దాన్యాన్ని చూసారు. రైతులతో మాట్లాడారు. కంగారు పడాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రితో మాట్లాడి రైతులకు తగు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.



Next Story

Most Viewed