TDP: అయోమయంలో ఆ ముగ్గురు..

by srinivas |   ( Updated:2022-12-21 16:21:53.0  )
TDP: అయోమయంలో ఆ ముగ్గురు..
X
  • మనస్సు అంతా బాధే
  • సీనియర్లు అయ్యాం.. ఏం సాధించాం
  • పార్టీపై పట్టు కోల్పోతున్నాం
  • సందిగ్ధంలో కొట్టిమిట్టలాడుతున్నాం
  • - టీడీపీ సీనియర్లు

దిశ ( ఉభయ గోదావరి): వారు తెలుగుదేశం పార్టీలో సీనియర్లు.. పార్టీ అవిర్భావం నుంచి అధినేత చంద్రబాబుతో ఉన్నవారు. అతని కనుసన్నలో మెలిగినోళ్లు.. జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన నేతలు. ఎన్నికలు వచ్చాయంటే చాలు.. వీరి సీట్లు కన్పాం చేసుకోవడమే కాదు. వీరికి అనుకూలంగా ఉన్నవారి కోసం అధినేతకు సిఫారసు కూడా చేసిన సందర్భాలున్నాయి. దీంతో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల్లో వీరిదే హవా. చోటా నాయకులు వీరి అడుగులకు మడుగులు ఎత్తాల్సిందే. అంతటి పేరున్న వీరు నేడు సందిగ్ధంలో పడ్డారు. మదినిండా బాధతో నింపుకొన్నారు. రాజకీయ భవిష్యత్తుపై సస్పెన్స్‌లో పడ్డారు. ఇంతకీ వారెవరో మీకు ఈ పాటికే అర్దం అయి ఉంటుంది. మరెవరో కాదు.. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో మొన్నటి దాకా చక్రం నేతలు.. వారిలో ఒకరు మాజీ మంత్రి యనమల రామక్రుష్ణుడు, జగ్గంపేట మాజీ శాసన సభ్యులు జ్యోతుల నెహ్రు, పెద్దాపురం శాసన సభ్యులు నిమ్మకాయల చిన రాజప్ప.. వీరు గుండె భారంతో పార్టీలో సేవలు అందిస్తున్నారు. భవిష్యత్తు మీద వీర్కి బోలెడు బెంగ ఉంది. ఒకప్పుడు ఎందరికో సీట్లు ఇచ్చిన వీరు తాజాగా వీరి సీట్ల కోసం ఆశగా నిరీక్షిస్తున్నారు. పెద్దాయన వద్ద వీర్కి మార్కులు షరామామూలే అయినా , యువనేత వద్ద వీరికి తలపులు తెరుచుకోవడం లేదు. తీరా అడిగామంటే యువతకే ప్రాధాన్యం అంటున్నారు. అలాగని వీరి వారసులకు ఇస్తారా అంటే అది కూడా నో కామెంటుగా ఉంది.

ఆయన మాటలకు అర్ధమేంటి?

తునిలో మాజీ మంత్రి యనమల రామక్రుష్ణుడు పార్టీ సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో ఆయన అనేక నర్మ గర్బ వాఖ్యలు చేశారు. 'ఇప్పటి దాకా నేను రాజకీయం చేశాను. ఇంకా చేయాలనుకొంటే అట్టే బాగోదు. ఇకపై యువతదే హవా. పార్టీ అదిష్టానం కూడా యువతకే స్థానం కల్పించేలా కనపడుతుంది. 2009లోనే నేను యువతకు ఇస్తేనే బెటర్ అని సలహా ఇచ్చాను. కానీ చంద్రబాబు నాడు నా మాట పెడచెవిన పెట్టారు. 2014 ఎన్నికల్లో మాత్రం ముఖ్యమంత్రి జగన్ ఆ పనిచేశారు. అందుకే సక్సెస్ అయ్యారు.' అని చెప్పుకొంటూ వచ్చారు. 'నేను ఆరు సార్లు నెగ్గాను. ఒకసారి ఓడిపోయాను. రెండుసార్లు నా తమ్మడు క్రుష్ణుడు ఓడిపోయారు. ఈసారి కూడా ఓడిపోతే తునికే పరిమితం అవ్వాలి.' అని అన్నారు.


మరోవైవు తునిలో యనమల హవా తగ్గిందనే విషయం పార్టీ అధిష్టానం గ్రహించింది. యనమల కుటుంబానికి సీటు కష్టం అనే వార్త ప్రాచారంలోకి వచ్చింది. స్థానిక మాజీ శాసన సభ్యులు రాజా అశోక్ బాబును రంగంలోకి దింపాలనే యోచన పార్టీకి ఉన్నట్లు సమాచారం. అయితే బీసీల్లో మరో వర్గానికి కూడా ఇవ్వాలని చూస్తున్నారు. యనమలకు చంద్రబాబుతో మంచి సాన్నిహిత్యం ఉన్నా, యువనేత లోకేష్ వద్ద పప్పులు ఉడికేలా కనపడటం లేదు. సీట్లు పంపకం విషయంలో ఆయన చాలా సీరియస్‌గా నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. దీంతో యనమల చాలా అన్ ఈజీలో పడిపోయారు. భవిష్యత్తు ఎలా ఉంటుందా అనే మీమాంసలో పడ్డారు. కనీసం తన కుమార్తె కైనా ఇవ్వాలనే పట్టుదలతో ఉన్నారు. కానీ లోకేష్ నిర్ణయం చివరి వరకూ ఎలా ఉంటుందో చెప్పలేము..

నర్మగర్భంగా జ్యోతుల

జగ్గంపేటలో చక్రం తిప్పి అపర భగీరధుడు అనిపించుకున్న జ్యోతుల నెహ్రు.. నేడు చాలా డీలాగా కనపడుతున్నారు. జగ్గంపేటలో అతని పట్టుకు ఏమీ డోకాలేదు. అయితే అధిష్టానం వ్యవహారం ఆయనకు అంతు చిక్కడం లేదు. ఓ ప్రక్కన తన కుమారుడు కాకినాడ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ పార్టీలో చరుకైన పాత్ర పోషిస్తున్నారు. అంతేగాక కాకినాడ యంపీ సీటు ఆసిస్తున్నారు. నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నారు. కానీ అధిష్టానం నుంచి కనీస స్పందన లేదు. తండ్రికుమారుడు కష్టపడుతున్నా సరే ఎవరికి సీటు దక్కుతుందో, ఎవరికి దక్కతో కూడా చెప్పలేని పరిస్థితి నెలకొంది. జగ్గంపేటలో నెహ్రుకు సీటు ఇస్తారా, లేక యువత కోటాలో అతని కుమారుడు నవీన్‌కు ఇస్తారా లేక చాక చక్యంగా మిత్ర పక్షంలో పోటీ ఉంటే జనసేనకు కేటాయిస్తారా అనేది ప్రశ్నార్దకం.. దీంతో నెహ్రు చాలా అసహనంలో పడ్డారు. కష్ట పడుతున్నాం ఫలితం దక్కుతుందా అనే మదన పడుతున్నారు. అంతేగాక పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయిన కాకినాడ రూరల్ యంఎల్ఏ సత్యనారాయణమూర్తిని మళ్లీ చంద్రబాబు వద్దకు తీసుకెళ్లడంతో ముఖ్య పాత్ర వహించిన మాజీ మంత్రి యనమల రామక్రుష్ణుడుపై ఆయన గుర్రుగా ఉన్నారు. పైకి నర్మగర్బంగా ఉన్నా లోలోన మదన పడుతున్నారు.

పైన పటారం.. లోన లొటారం.. రాజప్ప

2019లో వైసీపీ గాలిలో దర్జాగా గెలిచిన పెద్దాపురం శాసన సభ్యడు వచ్చే ఎన్నికలకు సీటు దక్కుతుందా లేదా అనే సందిగ్ధంలో పడ్డారు. ఈ సారి స్థానం కమ్మవారికి ఇవ్వాలని పట్టుబడుతున్నారు. ఈ విషయం లోకేష్ వద్ద పంచాయితీ కూడా నడుస్తుంది. ఇంతలోనే రాజప్ప స్థానికంగా మీటింగ్ పెట్టారు. సీటు నాదే అని ప్రకటించుకొన్నారు. అంతేగాక గ్రామాల పర్యటన కూడా చేస్తున్నారు. ఇంత చేస్తున్నా అధిష్టానం నోరు విప్పడం లేదు. సీటు రాజప్పదే అని ఒక్క మాట అనడం లేదు. ఈ బాధ రాజప్ప మదిలో వెంటాడుతుంది. ఎంతైనా కమ్మవారు. చంద్రబాబు సామాజికవర్గంనకు చెందిన వారు. చివరి దాకా వస్తే గెలుపు వారిదే.. ఇవే ఆలోచనలు రాజప్పను దొలిచేస్తున్నాయి. తీరా అధిష్టానాన్ని అడుగుదామంటే సమాదానం ఏం వస్తుందో అనే భయం.. ఇది ఆ ముగ్గురి తీరు.



Next Story

Most Viewed