జనసేన సీట్లలోనే సర్దుబాటు చేసుకోవాలి.. బీజేపీ డిమాండ్‌పై స్పందించిన బుచ్చయ్య చౌదరి

by srinivas |   ( Updated:2024-02-16 11:03:05.0  )
జనసేన సీట్లలోనే సర్దుబాటు చేసుకోవాలి.. బీజేపీ డిమాండ్‌పై స్పందించిన బుచ్చయ్య చౌదరి
X

దిశ, వెబ్ డెస్క్: ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో పొత్తుల అంశం పీటముడిగా మారింది. 2014 మాదిరిగా టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకునే సంకేతాలు రాష్ట్రంలో కనిపిస్తున్నాయి. అయితే బీజేపీ 20 అసెంబ్లీ కోరుతున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా రాజమండ్రి రూరల్ నియోజకవర్గాన్ని బీజేపీ అడుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఆయా స్థానాల్లో టీడీపీ నేతల పరిస్థితేంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఈ నేపథ్యంలో రాజమండ్రి రూరల్ టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య స్పందించారు. టీడీపీ సీట్ల విషయంలో రెండేళ్ల క్రితమే నిర్ణయం జరిగిపోయిందని ఆయన చెప్పారు. టీడీపీ సిట్టింగులందరికీ మళ్లీ సీట్ల ఇస్తానని చంద్రబాబు స్పష్టం చేశారని బుచ్చయ్య స్పష్టం చేశారు. జనసేన ఇచ్చే సీట్లలో బీజేపీ వాళ్లు సర్దుబాటు వాళ్ల ఇష్టమని చెప్పారు. టికెట్ల ఆశించి చాలామంది టీడీపీలో చేరుతున్నారని, కానీ తొలి నుంచి ఉన్న టీడీపీ నాయకులకే సీట్లు ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు. తాను మాత్రం మళ్లీ రాజమండ్రి రూరల్ నుంచి పోటీ చేస్తున్నట్లు బుచ్చయ్య వెల్లడించారు.



Next Story