Kakinada: నిబంధనలకు విరుద్ధంగా రిగ్ బ్లాస్టింగ్

by srinivas |   ( Updated:2022-12-30 13:52:52.0  )
Kakinada: నిబంధనలకు విరుద్ధంగా రిగ్ బ్లాస్టింగ్
X
  • మామూళ్ల మత్తులో యంత్రాంగం
  • ఫిర్యాదులిచ్చినా ఫలితం శూన్యం
  • తక్కువ ఖర్చుతో అధిక లాభాలకు యత్నం
  • జె. అన్నవరం క్వారీ యాజమాన్యం నిర్వాకం

దిశ (ఉభయ గోదావరి): కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం జె. అన్నవరంలో తక్కువ ఖర్చుతో అధిక లాభాలు కలగాలనే ఉద్దేశంతో నిబంధనలకు విరుద్ధంగా రిగ్ బ్లాస్టింగ్స్ నిర్వహిస్తున్నారు. దీంతో స్థానిక జనం బెంబేలెత్తిపోతున్నారు. గతంలో ఈ బ్లాస్టింగ్స్ వల్ల రౌతలపూడిలో ఇద్దరు బలి అయ్యారు. ఈ ఘటనతో జె.అన్నవరం చుట్టు ప్రక్కల ప్రాంతాల ప్రజలు మరింత ఆందోళనలో పడ్డారు. అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యమైందని, అధికారులు కూడా క్వారీ యాజమాన్యానికి వత్తాసు పలుకుతోందని స్థానికులు చెబుతున్నారు.

జె.అన్నవరం సర్వే నెంబరు 297 నందు నల్ల రాతి క్వారీ‌పై సూర్య స్టోన్ క్రషర్ యాజమాన్యం శ్రీనివాసరావు రిగ్ బ్లాస్టింగ్ నిర్వహిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. వాస్తవానికి రిగ్ బ్లాస్టింగ్ నిర్వహించాలంటే కచ్చితంగా ఆ క్వారీకి లైసెన్సు కలిగిన బ్లాస్టర్ ఉండాలి. ఆ బ్లాస్టర్‌కు మైన్స్ సేఫ్టీ అధికారులు అనుమతులు కూడా ఉండాలి. ఇవేమీ లేకుండా బ్లాస్టింగ్స్ నిర్వహించకూడదు. కానీ ఏ విధమైన లైసెన్సు లేకుండా బ్లాస్టర్స్ జరుపుతున్నారు. అంతేకాదు భద్రతా ప్రమాణాలు, వ్యక్తిగత భద్రతా పరికరాలు సమకూర్చకుండా అనుభవం లేని వ్యక్తులతో బ్లాస్టింగ్స్ నిర్వహిస్తున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి. గతంలో రౌతల పూడిలో ఇదే విధమైన క్వారీ నిర్వాహణలో ఇద్దరు బలయ్యారు. దీంతో జె. అన్నవరం ప్రజలు బెంబెలెత్తిపోతున్నారు.

అయితే ఈ విషయమై దిశ ప్రతినిధి మైనింగ్ అధికారిని వివరణ కోరగా అది తమ పరిధి కాదన్నారు. వాస్తవానికి తాము లీజులు మాత్రమే చూస్తామని, మిగతా పని అంతా పోలీసులు చూసుకోవాలని అంటున్నారు. ఇదిలా ఉండగా మైనింగ్ అధికారులు కూడా నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నారని బాధితులు అంటున్నారు. వీరు పరిధిలో లేనప్పడు ఫిర్యాదు అందుకొని సంబంధిత అధికారులకు ఎందుకు పంపడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయమై చర్యలు తీసుకోకపోతే తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తామని జె. అన్నవరం ప్రజలు హెచ్చరించారు.



Next Story

Most Viewed