- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
Rajuhmundray: లూథ్రాపై ఫిర్యాదు.. పోలీసుల నిర్ణయంపై ఉత్కంఠ

దిశ, వెబ్ డెస్క్: స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు తరఫున వాదనలు వినిపిస్తున్న లాయర్ సిద్ధార్థ లూథ్రాపై మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు హౌస్ కస్టడీపై ఏసీబీ కోర్టులో నిరాశ ఎదురవడంతో యుద్ధం చేయాల్సిందేనని సిద్ధార్థ లూథ్రా ట్వీట్ చేశారు. అయితే లూథ్రా ఈ ట్వీట్ చేయడంపై రౌతు సూర్యప్రకాశరావు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయుధాలతోనే పని జరుగుతుందని లూథ్రా చేసిన ట్వీట్ రెచ్చగొట్టేలా ఉందని తప్పుబట్టారు. లూథ్రా ట్వీట్ హింస ప్రేరేపించేలా ఉందని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. లూథ్రాపై చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే పోలీసుల నిర్ణయంపై టీడీపీ శ్రేణుల్లో ఉత్కంఠత నెలకొంది.
కాగా చంద్రబాబు హౌస్ కస్టడీ విషయంలో ఏసీబీ కోర్టు చుక్కెదురయిన సమయంలో లూథ్రా ట్వీట్ చేశారు. ‘అన్ని విధాలుగా ప్రయత్నించినప్పుడు ఇంకా న్యాయం కనుచూపు మేరలో లేదు అని తెలిసినప్పుడు...కత్తి తీసి పోరాటం చేయడమే సరైనది’ అని గురు గోవింద్ సింగ్ వ్యాఖ్యలను లూథ్రా ట్విటర్లో షేర్ చేశారు. ఈరోజు ఇదే మా నినాదం అంటూ లూథ్రా ట్వీట్ చేశారు. ఈ ట్వీట్పై నెటిజన్లు స్పందిస్తున్నారు. మీరే గెలుస్తారంటూ నెటిజన్లు మద్దతుగా కామెంట్స్ చేస్తున్నారు.