Tuniలో రైలు కిందపడి వృద్ధురాలి మృతి

by Disha Web Desk 16 |
Tuniలో రైలు కిందపడి వృద్ధురాలి మృతి
X

దిశ, తుని: రైలు కిందపడి గుర్తు తెలియని 65 ఏళ్ల వృద్ధురాలి మృతి చెందినట్లు రైల్వే ఎస్సై అబ్దుల్ మారుప్ తెలిపారు. శుక్రవారం ఉదయం తుని రైల్వే స్టేషన్ సమీపంలో కొండవారిపేట తూము వద్ద రెండో నెంబర్ ప్లాట్ ఫారం పై వృద్ధురాలి మృతదేహం లభ్యమైందన్నారు. మృతురాలి వద్ద ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో మృతదేహాన్ని ఏరియా ఆసుపత్రికి తరలించామన్నారు. మృతురాలు పసుపు రంగు చీర కట్టుకుని చలి కోటు ధరించి గుండుతో ఉన్నట్లు వివరించారు. ఆచూకీ తెలిసిన వారు తుని రైల్వే పోలీసులను సంప్రదించాలని కోరారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అబ్దుల్ మారుప్ వెల్లడించారు.


Next Story

Most Viewed