- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
చనిపోయాడకున్న వృద్ధుడు అయిదేళ్లకు తిరిగొచ్చాడు..!

దిశ, పోలవరం: ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో ఆదివారం 'దిశ' దినపత్రికలో ''మానవత్వం చాటిన జిల్లా కలెక్టర్'' అనే ప్రచురణ పాఠకులకు విధితమే. మతిస్థిమితం లేని వృద్ధుడిని జంగారెడ్డిగూడెం పంచాయతీ, మున్సిపల్ సిబ్బంది చెత్త ట్రాక్టర్లో ఆస్పత్రిలో చేర్చారు. ఈ క్రమంలో జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఆదేశాలతో అధికార యంత్రాంగం దగ్గర ఉండి మరి కోరుకొండ రామారావుకు వైద్యం చేయించారు. అయితే కోరుకొండ రామారావు మతిస్థిమితం కోల్పోయి ఐదేళ్ల క్రితమే ఇంట్లో (కాకినాడ) నుంచి వెళ్ళిపోయాడని, చనిపోయాడని తామంతా భావించామని కుటుంబ సభ్యులు తెలిపారు. పత్రికలో వచ్చిన వార్తలను చూసి రామారావును గుర్తు పట్టామన్నారు. రామారావు తమ్ముడు కుమారుడు రాజ్కుమార్ కాకినాడలో హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నారు. పత్రికలో వచ్చిన వార్తను చూసి రామారావు కుటుంబ సభ్యులు జంగారెడ్డిగూడెం వెళ్లారు. అక్కడ రామారావును తహశీల్దార్ స్లీవజోజీ వారికి అప్పజెప్పి అంబులెన్స్లో కాకినాడకు పంపారు. ఈ సందర్భంగా హెడ్ కానిస్టేబుల్ రాజ్కుమార్ 'దిశ' పత్రికకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.