'ఆయన వల్లే కుప్పంలో అల్లర్లు'..

by srinivas |
ఆయన వల్లే కుప్పంలో అల్లర్లు..
X

దిశ, తుని: రాష్ట్రమంతటా రాజకీయ నాయకులకు ప్రజలు స్వాగతం పలుకుతుంటే కుప్పంలో మాత్రం అక్కడి ప్రజలు చంద్రబాబు‌కు ఎదురు తిరుగుతున్నారని రోడ్లు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా అన్నారు. చంద్రబాబు నాయుడు కుప్పం వెళ్తేనే అక్కడ అల్లర్లు జరుగుతున్నాయని ఆయన విమర్శించారు. తుని రాజా గ్రౌండ్‌లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్ష నేత చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కుప్పం ప్రజలంతా పండగని పండగల చేసుకోవాలంటే బాబు రావొద్దు అంటున్నారని ఆయన తెలిపారు. కుప్పం ప్రజలు తమకు ఇదేం ఖర్మ బాబు అంటున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు బాబు అక్కడికి రాకపోతేనే కుప్పం ప్రజలు సంక్రాంతి పండగ ప్రశాంతంగా చేసుకుంటారని మంత్రి దాడి శెట్టి రాజా పేర్కొన్నారు.



Next Story

Most Viewed