Breaking News: పశ్చిమగోదావరి జిల్లాలో భారీ పేలుడు.. నలుగురి మృతి?

by srinivas |
Breaking News: పశ్చిమగోదావరి జిల్లాలో భారీ పేలుడు.. నలుగురి మృతి?
X

దిశ వెబ్ డెస్క్: పశ్చిమగోదావరి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. తాడేపల్లిగూడెం మండలం కడియుద్ధలో బాణాసంచా గోడౌన్‌లో మంటలు చెలరేగాయి. నలుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో కార్మాగారంలో 10 ఉన్నట్లు సమాచారం. పలువురికి గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఫైర్ సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలంలో సహాయ చర్యలు అందిస్తున్నారు. ఒక్క సారిగా భారీ పేలుడు సంభవించినట్లు స్థానికులు తెలిపారు. ఘటనతో తామంతా భయాందోళనకు గురయ్యామని తెలిపారు.



Next Story