వాళ్లు నన్ను చాలా ఇబ్బందులు పెట్టారు: ముద్రగడ

by srinivas |
వాళ్లు నన్ను చాలా ఇబ్బందులు పెట్టారు: ముద్రగడ
X

దిశ, వెబ్ డెస్క్: చంద్రబాబు తనను చాలా ఇబ్బందులు పెట్టారని కాపు నేత ముద్రగడ పద్మనాభం అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్కు పవన్కు చాలా తేడా ఉందని చెప్పారు. 30 ఏళ్లు జగన్ సీఎంగా ఉంటారని జోస్యం చెప్పారు. 20 సీట్ల కోసం పవన్కు తాను ఎందుకు సపోర్ట్ చేయాలని ప్రశ్నించారు. ఒక ఎంపీ, ఎమ్మెల్యే లేకుండా పార్టీ పెడితే తాను వెళ్లాలా అని ముద్రగడ పద్మనాభం ప్రశ్నించారు. చంద్రబాబు, పవన్ ఓటమి కోసం పని చేస్తానని ముద్రగడ పద్మనాభం స్పష్టం చేశారు. చిరంజీవి ఓడిపోయాడని, పవన్ రెండు చోట్ల ఓడిపోయాడని గుర్తు చేశారు. ఉద్యమం వల్ల తాను నష్టపోయానని చెప్పారు. తన శత్రవులతో పవన్ కళ్యాణ్ ఎలా కలుస్తాడన్నారు. పిఠాపురంలో పవన్ కచ్చితంగా ఓడిపోతాడని జోస్యం చెప్పారు. కాపుల కోసం పవన్ ఇప్పుడు ఉద్యమం చేయవచ్చు కదా అని ముద్రగడ పద్మనాభం ప్రశ్నించారు.



Next Story

Most Viewed