- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
బాలుడిని ఆదుకున్న ఎమ్మెల్యే ద్వారంపూడి.. సీఎంతో మాట్లాడి రూ.14 లక్షలు మంజూరు

దిశ, కాకినాడ: జన్యు పరమైన వ్యాధితో బాధ పడుతున్న పప్పుల జస్వంత్ అనే బాలుడిని కాకినాడ సిటీ శాసన సభ్యుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆదుకున్నారు. ముఖ్యమంత్రి జగన్తో ప్రత్యేకంగా మాట్లాడి చికిత్స కోసం రూ.14 లక్షలు మంజూరు చేయించారు. దీంతో బాలుడు తల్లి దండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. కాకినాడ సాంబమూర్తి నగర్కు చెందిన పప్పుల జస్వంత్ అనే బాలుడు జన్యు పరమైన వ్యాధితో బాధ పడుతున్నాడు. తల్లి దండ్రులకు ఆర్ధిక స్థోమత లేక పోవడం వల్ల చికిత్స చేయించలేకపోతున్నారు. విషయం ఎమ్మెల్యే ద్వారంపూడి దృష్టికి తీసుకుని వెళ్లారు. దీంతో ద్వారంపూడి వెంటనే స్పందించారు. ముందుగా యువసేనతో మాట్లాడి వైద్య పరీక్షలు చేయించారు. ఆ తర్వాత సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లి శస్త్ర చికిత్స కోసం రూ. 14 లక్షలు మంజూరు చేయించారు. దాని తాలూకు పత్రాలు కూడా అందించారు. త్వరలోనే బాలుడికి హైదరాబాదు సెటిజన్ ఆసుపత్రిలో చికిత్స చేయించనున్నారు.