- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
Bjp Building Committee: టీడీపీనే మా ప్రధాన శత్రువు

- మేము టీడీపీతో కలిసే పరిస్థితే లేదు
- కేంద్ర పథకాలు అన్నీ రాష్ట్రం వాడుకుంటుంది
- వైఎస్సార్ పథకాలు అన్నీ కేంద్రనిధులతోనే
- బీజేపీకి మరింత ఆదరణ పెరిగింది
- - బీజేపీ రాష్ట్ర బిల్డింగ్ కమిటీ సభ్యుడు గట్టి సత్యనారాయణ
దిశ ( ఉభయ గోదావరి ప్రతినిధి): రాష్ట్రంలో టీడీపీ ప్రధాన శత్రువని, ఆ పార్టీతో ఎట్టి పరిస్థితిల్లోనూ పొత్తు ఉండదని రాష్ట్ర బీజేపీ బిల్డింగ్ కమిటీ సభ్యుడు , కాకినాడ సిటీ కోఆర్డినేటర్ గట్టి సత్యనారాయణ అన్నారు. బుధవారం ఆయన దిశతో ప్రత్యేకంగా మాట్లాడారు. టీడీపీతో కలుస్తామని చాలా మంది అంటున్నారని, అది ప్రచారం మాత్రమేనని కొట్టిపారేశారు. అదే విధంగా వైసీపీ కూడా శత్రువేనని చెప్పారు. జనసేన వస్తే కచ్చితంగా కలుపుకొంటామన్నారు. చంద్రబాబును ప్రధాని నరేంద్ర మోదీ నమ్మరని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో సీఎం జగన్ కేంద్ర పథకాలను వినియోగించుకొంటున్నారని పేర్కొన్నారు. కేంద్ర పథకాల వల్లే రాష్ట్రం నడుస్తోందన్నారు. అయితే ప్రచారం జగన్ చేసుకొంటున్నారని ఎద్దేవా చేశారు.
ఉద్యోగులకు నెలకు ఠంచనుగా జీతాలు ఇవ్వకపోవడాన్ని తాము ఖండిస్తున్నామని గట్టి సత్యనారాయణ అన్నారు. దీనిపై పోరాటం కూడా చేస్తున్నామని చెప్పారు. టీటీడీలో ధరలు పెంచారని, దీని వల్ల భక్తులు చాలా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఈ విషయమై ఛలో డిల్లీ నిర్వహించనున్నామని స్పష్టం చేశారు. జీవో నెంబరు -1 కూడా దారుణమని మండిపడ్డారు. ప్రస్తుతం జగన్ ప్రభుత్వం చాలా బ్యాడ్ అయిందని, జనంలో చులకన అయిందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడం చాలా కష్టమని తెలిపారు. రాష్ట్రంలో బీజేపీకి మరింత ఆదరణ పెరిగిందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరగడమే కాకుండా కొన్ని సీట్లు కూడా సాధించుకొంటామని గట్టి సత్యనారాయణ ధీమా వ్యక్తం చేశారు.