జొన్నాడలో అగ్ని ప్రమాదం.. బాధితులకు బాసటగా నాయకులు

by srinivas |
జొన్నాడలో అగ్ని ప్రమాదం.. బాధితులకు బాసటగా నాయకులు
X

దిశ (ఉభయ గోదావరి): అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం జొన్నాడలో కుంతీదేవి ఆలయ సమీపంలో అగ్ని ప్రమాదం జరిగింది. పూరింటిలో మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు మండపేట అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందజేశారు. ఈ మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. మంటలను అదుపు చేశారు. అయితే లక్షా 80 వేల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు బాధితులు తెలిపారు. విషయం తెలుసుకున్న గ్రామ ఉప సర్పంచ్ నాండ్ర నాగమోహన్ రెడ్డి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు బాధితులకు బాసటగా నిలిచారు. తక్షణ ఆర్థిక సహాయంగా రూ. 5 వేలు సాయం చేశారు. నిత్యవసర వస్తువులను సైతం అందజేశారు. ఈ సందర్భంగా గ్రామ నాయకులు మాట్లాడుతూ అధైర్య పడవద్దని బాధితులకు భరోసా ఇచ్చారు. నూతన గృహ నిర్మాణంపై అధికారులతో మాట్లాడి తగు ఏర్పాట్లు చేస్తామన్నారు. బాధితులు తాత్కాలికంగా గ్రామ ఎస్సీ కమ్యూనిటీ హాల్లో ఉండేందుకు ఏర్పాట్లు చేశామని చెప్పారు. ఈ కార్యక్రమంలో తాడి శ్యామ్ సుందర్ రెడ్డి, గొలుగూరి సత్తిరెడ్డి, కట్టా ప్రసాద్, నక్కా రాజేష్, రొక్కల బాలరాజు తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed