EastGodavari: హార్డ్ వేర్ షాపులో భారీ చోరీ

by Disha Web Desk 16 |
EastGodavari: హార్డ్ వేర్ షాపులో భారీ చోరీ
X

దిశ వెబ్ డెస్క్: తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం పొలంగిలో దొంగలు రెచ్చిపోయారు. కొంతకాలంగా షాపులు, ఇళ్లు టార్గెట్‌గా దొంగతనాలకు పాల్పడుతున్నారు. తాజాగా హార్డ్ వేర్ దుకాణంలో చోరీకి పాల్పడ్డారు. రాత్రి సమయంలో దుకాణంలోకి చొరబడి రూ.38.5 లక్షలు ఎత్తుకెళ్లారు. దీంతో షాపు యాజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు చోరీ స్థలాన్ని పరిశీలించారు. స్థానికంగా ఉన్న సీసీ ఫుటేజీని పరిశీలించారు. నిందితులను పట్టుకుంటామని తెలిపారు.

ఇక స్థానిక ప్రజల దొంగల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. అయితే పోలీస్ పెట్రోలింగ్ లేకపోవడం వల్లే చోరీలు జరుగుతున్నాయని స్థానికులు అంటున్నారు. ఇప్పటికైనా ప్రతి నిత్యం పెట్రోలింగ్ నిర్వహించాలని కోరుతున్నారు.


Next Story