Kapu Reservation: పవన్ కల్యాణ్ విజ్ఞప్తి.. దీక్ష విరమించిన జోగయ్య

by srinivas |
Kapu Reservation: పవన్ కల్యాణ్ విజ్ఞప్తి.. దీక్ష విరమించిన జోగయ్య
X

దిశ, వెబ్ డెస్క్: జనసేన అధినేత పవన్ కల్యాణ్ విజ్ఞప్తితో మాజీ మంత్రి, కాపు నేత హరిరామ జోగయ్య దీక్ష విరమించారు. కాపు రిజర్వేషన్ల కోసం ఆయన నిరాహార దీక్షకు దిగారు. రెండు రోజులుగా ఉద్రిక్తతల నడుమ హరిరామ జోగయ్య దీక్ష కొనసాగిస్తునేన్నారు. దీంతో పవన్ కల్యాణ్ నిమ్మరసం ఇచ్చి హరిరామ జోగయ్యతో దీక్ష విరమింప చేశారు. కాగా కాపు రిజర్వేషన్ల కోసం హరిరామ జోగయ్య నిరాహార దీక్షుకు దిగుతానని రెండు రోజుల క్రితం ప్రకటన చేశారు. దీంతో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. హరిరామజోగయ్యను అదుపులోకి తీసుకుని ఏలూరుకు తరలించారు. అయినా హరిరామజోగయ్య దీక్షను కొనసాగించారు. అయితే ఆయన ఆరోగ్యం దృష్ట్యా దీక్ష విరమించాలని పలువురు నేతలు విజ్ఞప్తి చేశారు. కానీ వెనక్కి తగ్గలేదు. చివరకు పవన్ విజ్ఞప్తితో హరిరామ జోగయ్య తన దీక్షను విరమించారు.



Next Story

Most Viewed