Jd Laxminarayana: మళ్లీ అక్కడి నుంచే పోటీ

by Disha Web Desk 16 |
Jd Laxminarayana: మళ్లీ అక్కడి నుంచే పోటీ
X

దిశ వెబ్ డెస్క్: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ మళ్లీ విశాఖ నుంచే పోటీ చేయనున్నారు. ఈ మేరకు ఆయన ప్రకటన చేశారు. ఏ పార్టీ నుంచి పోటీ చేయాలనే విషయాలపై సన్నిహితులతో చర్చిస్తున్నట్లు ఆయన తెలిపారు. గతంలో జనసేన పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత జనసేన పార్టీకి రాజీనామా చేశారు. అప్పటి నుంచి పలు కార్యక్రమాల్లో ప్రసంగించినా ఎన్నికల్లో పోటీపై ప్రస్తావించలేదు. తాజాగా తన పోటీపై కాకినాడలో జరిగిన కార్యక్రమంలో లక్ష్మీనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏ పార్టీ నుంచి సీటు దొరకపోయినా ఇండిపెండెంట్‌గానైనా విశాఖ నుంచి బరిలోకి దిగుతానని జేడీ లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. దీంతో రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. ఇక ప్రభుత్వం చేస్తున్న అప్పులపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. అప్పులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలపై పెట్టుబడిదారులు ఆసక్తి చూపరని తెలిపారు.


Next Story