Eluru: సుబ్రహ్మణ్యేశ్వరుడి విగ్రహంపై పాము ప్రత్యక్షం

by srinivas |   ( Updated:2023-12-24 15:33:04.0  )
Eluru: సుబ్రహ్మణ్యేశ్వరుడి విగ్రహంపై పాము ప్రత్యక్షం
X

దిశ, ఏలూరు: తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం అనంతపల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో పాము ప్రత్యక్షమైంది. అనంతరం స్వామి విగ్రహంపైకి ఎక్కింది. బుసలు కొడుతూ దాదాపు 12 గంటలుపైగా విగ్రహంపై ఉండి భక్తులకు దర్శనమిచ్చింది. ఈ విషయం తెలిసి గ్రామస్తులు, స్థానిక గ్రామాల ప్రజలు తండోపతండాలుగా ఆలయానికి తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ దృశ్యాన్ని పలువురు వీడియోలో చిత్రీకరించారు. కొంతకాలం క్రితం స్థానిక పోలేరమ్మ గుడిలో అమ్మవారి విగ్రహం చుట్టూ పాము తిరిగినట్లు స్థానికులు తెలిపారు.



Next Story

Most Viewed