- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
3న తూర్పుగోదావరి జిల్లాకు Cm Jagan

దిశ, (ఉభయ గోదావరి): ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జనవరి 3న తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్నారని కలెక్టర్ డా.కే మాధవీలత పేర్కొన్నారు. సీఎం పర్యటన దృష్ట్యా జిల్లా అధికారులు సమన్వయంతో పని చేయాల్సి ఉందన్నారు. ఆయా శాఖల వారికి కేటాయించిన విధులు నిర్వర్తించాలని ఆమె తెలిపారు. ఈ నెల 28 నుంచి జనవరి 3 వరకు అధికారులకు, సిబ్బందికి సెలవులు మంజూరు చేయడం జరగదని కలెక్టర్ మాధవీలత స్పష్టం చేశారు.
ఇప్పటివరకు జిల్లాలో జరిగిన సీఎం పర్యాటనలను అధికారులు సమన్వయంతో పని చేయడం ద్వారా విజయవంతం చేశామని, అదే పని తీరు జనవరి 3న కూడా చూపాల్సిన అవసరం ఉందన్నారు. నూతనంగా ఏర్పడిన జిల్లాలో ప్రభుత్వ పథకాలను, కార్యక్రమాలను అధికారులు ఎంతో సమర్థవంతంగా నిర్వహించారని, ఇదే స్ఫూర్తితో పని చేయాలని కలెక్టర్ కె.మాధవీలత సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులకు ముందస్తు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.