ఆలమూరు ట్రాన్స్ కో ఏఈ లక్ష్మికి ఉత్తమ సేవ పురస్కారం

by srinivas |
ఆలమూరు ట్రాన్స్ కో ఏఈ లక్ష్మికి ఉత్తమ సేవ పురస్కారం
X

దిశ, కొత్తపేట: ఆలమూరు ట్రాన్స్ కో ఇన్‌చార్జ్ ఏఈ వై.లక్ష్మికి ఉత్తమ సేవా పురస్కారం లభించింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం సర్కిల్లో ఆలమూరు సెక్షన్‌ను ప్రథమ స్థానంలో నిలపడంతో లక్ష్మిని అభినందిస్తూ రాజమహేంద్రవరంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలలో ఏపీడీసీఎల్ ఎస్ఈ సివిఎన్.మూర్తి చేతుల మీదుగా ఉత్తమ సేవా పురస్కారాన్ని అందించారు. రామచంద్రపురం డివిజన్ స్థాయి ఉత్తమ సేవా పురస్కారం స్వీకరించిన ఆలమూరు ఇంచార్జ్ ఏఈ లక్ష్మిని పలువురు అధికారులు, నాయకులు, రైస్ మిల్లర్స్ అభినందించారు.



Next Story