Annavaram: శోభాయమానంగా సత్యదేవుడి తెప్పోత్సవం

by srinivas |
Annavaram: శోభాయమానంగా సత్యదేవుడి తెప్పోత్సవం
X

దిశ, అన్నవరం: అన్నవరం సత్యదేవుడి తెప్ప మహోత్సవం అత్యంత శోభాయమానంగా జరిగింది. కార్తీక మాసం క్షీరాబ్ది ద్వాదశి పర్వదినం సందర్భంగా అనంతలక్ష్మి సత్యవతి దేవి సమేత సత్యనారాయణ స్వామివార్లను పల్లకిలో ఆసీనులు గావించారు. అనంతరం కొండపై నుంచి మెట్ల మార్గం గుండా కొండ దిగువన తొలి పావంచాల వద్దకు తోడ్కోని వెళ్లారు. అక్కడ నుంచి పంపా సరోవర తీరం వద్ద వివిధ పుష్ప మాలికలతో అత్యంత సుందరీకరణగా అలంకరించిన వేదికపై స్వామి అమ్మవార్లను ఆసీనులుగావించారు. ఆ తర్వాత వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రధాన అర్చకులు, పురోహిత పెద్దలు పూజా కార్యక్రమాలను దిగ్విజయంగా నిర్వహించారు. అనంతరం మిరుమిట్లు గొలిపే విద్యుత్తు కాంతులతో అందంగా అలంకరించిన హంస వాహనంపై స్వామి అమ్మవార్ల ప్రదక్షిణ సుమారు గంటసేపు జరిగింది. తెప్ప మహోత్సవాన్ని వీక్షించేందుకు అన్నవరంతోపాటు పరిసర ప్రాంతాల ప్రజలు అశేష సంఖ్యలో తరలివచ్చి కనులారా చూసి తరించారు. ఈ సందర్భంగా విచ్చేసిన భక్తులకు స్వామివారి ప్రసాదంతో పాటు పులిహోర పంపిణీ చేశారు.



Next Story

Most Viewed