Kakinada: ఘోరం.. బైక్‌పై వెళ్తూ ముగ్గురు స్పాట్‌ డెత్

by srinivas |   ( Updated:2023-11-13 13:33:53.0  )
Kakinada: ఘోరం.. బైక్‌పై వెళ్తూ ముగ్గురు స్పాట్‌ డెత్
X

దిశ, వెబ్ డెస్క్: కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం లచ్చిపాలెంలో సోమవారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానిక బైపాస్ సెంటర్‌లో ట్రాక్టర్‌ను బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో ఆయన్ను ఆస్పత్రిలో చేర్చించారు. మృతులు, క్షతగాత్రుడు రత్తవారిపే చెందిన వారిగా గుర్తించారు. వీరంతా పెయింట్ పని వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈ నలుగురు కూడా ఒకే బైక్ పై ప్రయాణం చేస్తూ ప్రమాదానికి గురయ్యారు. అతివేగంగా నడపం వల్ల బైక్ అదుపు తప్పి ట్రాక్టర్‌ను ఢీకొట్టినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదంతో రోడ్డుపై నిలిచిపోయిన ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ప్రాణాలో కోల్పోయిన ముగ్గురు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతులు యానాం నుంచి తాళ్లరేవు వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగిందని నిర్ధారించారు. ఇక మృతుల బంధువుల రోదనలతో ఆ ప్రాంతమంతా విషాదఛాయలు అలుముకున్నాయి.



Next Story

Most Viewed