చంద్రబాబు మాదిరి ‘గ్రాఫిక్స్’ చూపి మోసం చేయం: మంత్రి బొత్స

by Disha Web Desk 18 |
చంద్రబాబు మాదిరి ‘గ్రాఫిక్స్’ చూపి మోసం చేయం: మంత్రి బొత్స
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఎన్నికల వేళ అన్ని పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలో మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో చంద్రబాబుకి, ఊసరవెల్లి కి తేడా లేదన్నారు. స్టేజీ మారితే ఆయన మాట కూడా మారుతుందని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. టీడీపీ చీఫ్ మాదిరి గ్రాఫిక్స్ చూపించి మోసం చేసే ప్రభుత్వం తమది కాదన్నారు. ఏడాదికి 60 లక్షల మంది ప్రయాణికుల సామర్థ్యంతో భోగాపురం ఎయిర్‌పోర్టు పనులు జరుగుతున్నాయని తెలిపారు. విశాఖ మెట్రో రైలు DPR రెడీ అయ్యిందని చెప్పారు. వైజాగ్ పరిపాలనా రాజధానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.

Next Story