AP Politics:కొణతాలని గెలిపించి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి:మాజీ మంత్రి

by Disha Web Desk 18 |
AP Politics:కొణతాలని గెలిపించి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి:మాజీ మంత్రి
X

దిశ ప్రతినిధి,అనకాపల్లి: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరిగి అభివృద్ధి చెందాలంటే కూటమి తరపున అనకాపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కొణతాల రామకృష్ణను గెలిపించి ప్రజాస్వామ్య వ్యవస్థని కాపాడాలని మాజీ మంత్రి జనసేన పార్టీ పీఏసీ సభ్యురాలు పడాల అరుణ పిలుపు నిచ్చారు. బుధవారం అనకాపల్లి మండలం వెంకుపాలెం, కుంచంగి గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గ్రామీణ అభివృద్ధి పూర్తిస్థాయిలో కుంటుపడిందని, జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్ భూ హక్కు చట్టం వలన రాష్ట్రంలోని రైతులు తీవ్ర ఇబ్బందులు పడతారని ఆరోపించారు.

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఒక్క ఛాన్స్ ఇచ్చి ప్రజలు తప్పు తెలుసుకున్నారని మరో ఛాన్స్ ఇచ్చి మోసపోవద్దని పడాల అరుణ ప్రజలను కోరారు, రాష్ట్రంలో జరగనున్న ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన అభ్యర్థులను ప్రజలు గెలిపించాలని లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి కోరారు. కొణతాల రామకృష్ణ రాజకీయ ప్రజా జీవితంలో ప్రజా సమస్యలపై అలుపెరుగని పోరాటం చేస్తూనే ఉన్నారని అందుకే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొణతాలను కోరి మరీ పోటీలోకి దించారని కొణతాలను ప్రజలు గెలిపిస్తే ఉత్తరాంధ్ర లోని ప్రాజెక్టులు పూర్తి అవుతాయని భీశెట్టి ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీటీసీ కనుబుడ్డి నరసింగరావు, జనసేన నాయకులు పడాల శరత్, మునకాల జగన్నాధ రావు, దాసరి యశ్వంత్, ఇజ్జురౌతు కృష్ణ, నడుపూరు అనిల్, శ్యామ్, కొలసాని రమణ, తదితరులు పాల్గొన్నారు.

Read More...

పల్నాడులో ఉద్రిక్తత.. ఎమ్మెల్యే భార్యపై దాడి

Next Story