హైదరాబాద్‌ టు వైజాగ్‌ హై స్పీడ్ రైలు కారిడార్

by Disha Web Desk |
హైదరాబాద్‌ టు వైజాగ్‌ హై స్పీడ్ రైలు కారిడార్
X

దిశ ప్రతినిధి, విశాఖపట్నం : ఆంధ్రా, తెలంగాణ ప్రజల చిరకాల కల నెరవేరే సమయం ఆసన్నమైంది. హైదరాబాద్‌ నుంచి విశాఖపట్నం వరకు విజయవాడ మీదుగా జాతీయ రహదారి వెంట హైస్పీడ్‌ రైలు కారిడార్‌ ఏర్పాటుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రైల్వేశాఖ ప్రిలిమినరీ ఇంజనీరింగ్‌ అండ్‌ ట్రాఫిక్‌ (పెట్‌) సర్వే చేపట్టింది. ఇందుకు సంబంధించిన బాధ్యతలను గత సంవత్సరం మే నెలలోనే ఎస్‌ఎం కన్సల్టెన్సీకి అప్పగించింది. వచ్చే నెల మార్చి నాటికి ప్రాథమిక సర్వే పూర్తి చేయనున్నట్ల తెలుస్తోంది. ఈ సర్వే ఆధారంగా సమగ్ర నివేదిక (డీపీఆర్‌) రూపొందించనున్నారు. దీని వల్ల రంగారెడ్డి, ఉమ్మడి నల్లగొండ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలో జాతీయ రహదారి వెంట ఉన్న ప్రాంతవాసుల రైలు కల సాకారం అయ్యే అవకాశాలు ఉన్నాయి. డీపీఆర్ ఆధారంగా కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోనుంది.

Next Story

Most Viewed