AP Politics:కూటమిది మాటలు కాదు చేతల ప్రభుత్వం:పీతల మూర్తి యాదవ్

by Jakkula Mamatha |
AP Politics:కూటమిది మాటలు కాదు చేతల ప్రభుత్వం:పీతల మూర్తి యాదవ్
X

దిశ ప్రతినిధి,విశాఖపట్నం:కూటమిది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరూపించారని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ కొనియాడారు. శుక్రవారం ఉదయం పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..ముఖ్యమంత్రిగా పీఠం మీద కూర్చున్న మొదటి క్షణంలోనే నిరుద్యోగ యువతకు మేలు చేసే డీఎస్సీ మీద మొదటి సంతకం, ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేస్తూ రెండో సంతకం, సామాజిక పింఛన్లు పెంచుతూ మూడో సంతకం, ఆకలి తీర్చే అన్న క్యాంటీన్‌కి నాలుగో సంతకం చేశారన్నారు. ముఖ్యమంత్రి అంటే ప్రజా సేవకుడని చాటి చెప్పే రీతిలో సామాన్య విద్యార్థుల లబ్ధిదారుల మధ్య బాధ్యత చంద్రబాబు తీసుకున్నారన్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు, ప్రభుత్వంలో కీలక వ్యక్తిగా పవన్ కళ్యాణ్ రాష్ట్రాన్ని శరవేగంగా అభివృద్ధి చేస్తారని తెలిపారు.

అసైన్డ్ భూముల పై సీఎం దృష్టి..

ఉత్తరాంధ్రలోని అసైన్డ్ భూములను జవహర్ రెడ్డి కొట్టి వేయడం పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టి పెట్టారన్నారు. ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి నేతృత్వంలో వేల కోట్ల రూపాయల విలువ చేసే వేలాది ఎకరాల దళితుల, బీసీల అసైన్డ్ భూముల అన్యాక్రాంత అయ్యాయని చెప్పారు. అసైన్డ్ తో పాటు విశాఖ కేంద్రంగా వేల కోట్ల భూ అక్రమ లావాదేవీలు వైసీపీ పెద్దల ఆధ్వర్యంలో జరిగాయని , వాటన్నింటి పై చంద్రబాబు విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement

Next Story

Most Viewed