- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
AP News:వారికి ఇన్సెంటివ్స్.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

దిశ,వెబ్డెస్క్: ఏపీ(Andhra Pradesh) సీఎం చంద్రబాబు ఇవాళ(శుక్రవారం) అనంతపురం జిల్లాలో పర్యటించారు. అనంతపురం హంద్రీనీవా పనులను సీఎం చంద్రబాబు(CM Chandrababu) పరిశీలించారు. అనంతరం ఉరవకొండ నియోజకవర్గం ఛాయాపురంలో ఏర్పాటు చేసిన సభలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదరికం వల్ల ఎవరికీ చదువుకోలేని పరిస్థితి రాకూడదని పేర్కొన్నారు. పేదరికంతో చాలామంది యువత చదువుకు దూరం అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
పేదవారు ఆకలితో ఉంటే సమాజానికి మంచిది కాదని వారికి అండగా ఉంటానని సీఎం చంద్రబాబు తెలిపారు. అలాగే ప్రతి ఒక్కరు వారికి అండగా నిలవాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు యువ జంటలకు కీలక సూచనలు చేశారు. ఎక్కువ మంది పిల్లలను కనాలని యువ జంటలకు సూచించారు. ఎంత మంది పిల్లలు ఉంటే అన్ని వసతులు కల్పిస్తామని ప్రకటించారు. పెద్ద కుటుంబాలను ఆదరిస్తామని భరోసా ఇచ్చారు. ఇన్సెంటివ్స్ ఇస్తామని తెలిపారు. అలాగే, వారిని ఆర్థికంగా ఆదుకుంటామని సీఎం చంద్రబాబు తెలిపారు.