ముస్లింలకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ బక్రీద్ శుభాకాంక్షలు

by srinivas |
ముస్లింలకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ బక్రీద్ శుభాకాంక్షలు
X

దిశ, వెబ్ డెస్క్: బక్రీద్ సందర్భంగా పేదలకు ఆహార వితరణ చేస్తానని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. సోమవారం బక్రీద్ సందర్భంగా ముస్లింలకు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ‘త్యాగగుణాన్ని ప్రబోదించే బక్రీద్‌ను అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలి. ప్రజల్లో స్వార్థం, రాగద్వేషాలు ఉండకూడదు. మానవుల్లో త్యాగనిరతిని పెంచడమే బక్రీద్ ఉద్దేశం. సమైక్యత, సమానత్వం గురించి ప్రతిఒక్కరూ ఆలోచించాలి.’ అని చంద్రబాబు పేర్కొన్నారు.

మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ ‘ త్యాగం, దానగుణాలకు ఇస్లాంలో ప్రత్యేక స్థానం ఉంది.’ అని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed