Pileru: మసీదుల అభివృద్ధికి ఎంపీ మిథున్ రెడ్డి నిధులు

by srinivas |
Pileru: మసీదుల అభివృద్ధికి ఎంపీ మిథున్ రెడ్డి నిధులు
X

దిశ, పీలేరు: ఎంపీ లాడ్స్ నుంచి పీలేరు నియోజకర్గం వాల్మీకిపురంలో 9 మసీదుల అభివృద్ధికి రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి రూ. 37 లక్షలు మంజూరు చేశారు. పలు మసీదులను సందర్శించి ఆయా మసీదుల ముతవల్లిలకు చెక్ లను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా మిథున్ రెడ్డి మాట్లాడుతూ తమ ప్రభుత్వం ముస్లింల అభివృద్ధికి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, రాష్ట్ర మైనారిటీ కమిషన్ ఛైర్మన్ డాక్టర్ ఇబ్బాల్ అహమద్, ఏపీ ఎం డి సి డైరెక్టర్ హరీష్ రెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ డైరెక్టర్ కలీం, పరిశీలకుడు సహదేవ రెడ్డి తదతరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed