- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
క్షుద్రపూజలతో బాలికలకు గర్భం.. విషయం తెలిసి తల్లిదండ్రులు షాక్
దిశ, వెబ్ డెస్క్: క్షుద్రపూజలను తమ స్వలాభాల కోసం వినియోగించుకుంటున్నారు. వాటిపై ప్రజలకు ఉన్న భయాన్ని ఆసరాగా చేసుకొని అమాయకుల జీవితాలను నాశనం చేస్తున్నారు. అలాంటి ఓ ఘటన తాజాగా చోటు చేసుకుంది. క్షుద్రపూజల పేరుతో కొందరు కేటుగాళ్లు ఓ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారు. కొన్ని రోజుల తర్వాత ఆ బాలిక గర్భం దాల్చడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
పోలీసుల వివరాల ప్రకారం.... సుబ్బయ్య (55), భాస్కర్ (60) ఇద్దరు వ్యక్తులు గ్రామంలో క్షుద్రపూజలు చేస్తుండేవారు. ఈ క్రమంలో ఆ గ్రామానికి చెందిన పదహారేళ్ల బాలికకు క్షుద్రపూజలతో భయం కల్పించారు. నీ కుటుంబంలో ఓ సమస్య ఉంది.. మేము చెప్పినట్టు వినాలి.. అలా చేయకపోతే నీ తల్లిదండ్రలకు మరణం తప్పదని తనను ఇబ్బందులకు గురిచేశారు. ఆ విధంగా భయపెట్టి ఆమెపై మూడు నెలలుగా లైంగిక దాడికి పాల్పడ్డారు. అయితే దాడికి చేసిన కొన్ని రోజులకు ఆమె అనారోగ్యానికి గురైంది. దీంతో తల్లిదండ్రులు వైద్య పరీక్షలు చేయించగా బాలిక గర్భం దాల్చిన విషయం తెలిసింది. విషయం తెలియగానే తల్లిదండ్రులు ఆమెను ఆరా తీయగా తనపై జరిగిన దాడి గురించి చెప్పుకుంది. దీంతో నిందితులపై తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా వారి పై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.