Tirumala: విజిలెన్స్ అదుపులో ఎండోమెంట్ సెల్ ఉద్యోగి శ్రీహరి

by Disha Web Desk 16 |
Tirumala: విజిలెన్స్ అదుపులో ఎండోమెంట్ సెల్ ఉద్యోగి శ్రీహరి
X

దిశ వెబ్ డెస్క్: తిరుమలలో ఎండోమెంట్ సెల్ ఉద్యోగి శ్రీహరిని టీటీడీ విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సిఫార్సు లేఖలపై పొందే వీఐపీ దర్శన టికెట్లను శ్రీహరి అధిక రేట్లకు అమ్ముతున్నాడు. పక్కా సమాచారంతో అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా శ్రీహరి అక్రమ గుట్టును రట్టు చేశారు.

కాగా శ్రీహరి గతంలో మాజీ టీటీడీ ఛైర్మన్ పుట్టా సుధాకర్ రెడ్డి కార్యాలయంలో పని చేశారు. అక్రమాలకు అలవాటు పడి ప్రధాన పోస్టులోనే ఉద్యోగం ఉండేలా పైరవీలు చేశారు. నందిగామ ఎమ్మెల్యే సీఫార్సు లేఖలపై పొందిన 6 వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్లను రూ. 18 వేలకు విక్రయించారు. శ్రీహరిని అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే శ్రీహరి బ్యాంకు అకౌంట్‌లో భారీగా నగదు జయ అయినట్లు అధికారులు గుర్తించారు. ఎండోమెంట్ సెల్ ద్వారా కూడా దర్శనం టికెట్లను శ్రీహరి పొందినట్లు తెలుస్తోంది.


Next Story

Most Viewed