- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- కార్టూన్
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- Bigg Boss Telugu 7
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- Telangana Assembly Election 2023
- ICC World Cup 2023
Tirupatiలో సీఎం జగన్ పర్యటన.. టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల పట్టాల పంపిణీ

దిశ, వెబ్ డెస్క్: సీఎం జగన్ మోహన్రెడ్డి తిరుపతిలో పర్యటిస్తున్నారు. నగరంలో నిర్మించిన శ్రీనివాససేతు ఫ్లై ఓవర్ను ఆయన ప్రారంభించారు. రూ.684 కోట్లతో ఈ ఫ్లై ఓవర్ నిర్మాణాన్ని చేపట్టారు. ఈ ఫ్లైఓవర్ను ప్రారంభించడంతో పాటు ఎస్వీ కాలేజీ హాస్టల్ భవనం ప్రారంభోత్సవంతో పాటు టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాల పట్టాలు కూడా సీఎం జగన్ పంపిణీ చేశారు. శ్రీనివాససేతు ఫ్లై ఓవర్ బ్రిడ్జి వల్ల తిరుపతి వాసుల ట్రాఫిక్ కష్టాలకు తెరపడతుందని తెలిపారు. తాను అధికారంలోకి వచ్చిన వెంటనే శ్రీనివాస సేతు ఫ్లైఓవర్కు శంకుస్థాపన చేసి నాలుగేళ్లలో పూర్తి చేశామని చెప్పారు. దాదాపు 6 వేల 700 మంది టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల పట్టాలు ఇచ్చామని చెప్పారు. మరో 3 వేల 500 మంది టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల పట్టాలు ఇస్తామన్నారు. నెల నుంచి 45 రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేస్తామని కలెక్టర్ తెలిపారని సీఎం జగన్ పేర్కొన్నారు. దాదాపు రూ.1300 కోట్లతో తిరుపతిని అభివృద్ధి చేస్తున్నామని సీఎం జగన్ తెలిపారు.