తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు

by Jakkula Mamatha |
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు
X

దిశ,తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. శనివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో ఎస్సీ, ఎస్టీ జాతీయ కమిషన్ సభ్యులు దొడ్లపల్లి రామచంద్ర, ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణ, గాలి భానుప్రకాష్, ఆదిరెడ్డి శ్రీనివాస్, ప్రముఖ ఎంటర్టైన్మెంట్ యాంకర్ శ్రీముఖి వేర్వేరుగా స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా.. ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రం తో సత్కరించారు.



Next Story

Most Viewed