- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఏపీలో దారుణం..8 ఏళ్ల చిన్నారిని సచివాలయింలోకి తీసుకెళ్లి?
దిశ, వెబ్ డెస్క్: దేశంలో ఏదొక మూలన నిత్యం చిన్నారులపై లైంగిక దాడులు జరుగుతూనే ఉన్నాయి. పసిపిల్లలని కూడా చూడకుండా వారిపై పైశాచికత్వం చూపిస్తున్నారు కొందరు దుర్మార్గులు. తాజాగా చిత్తూరు జిల్లాలో మనవరాలు వయసున్న చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ 70 ఏళ్ళ వృద్ధుడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చిత్తూరు జిల్లా తవణంపల్లె మండలానికి చెందిన ఉమాపతి భార్య మృతి చెందడంతో కూలి పనులు చేసుకుంటూ ఒంటరిగా ఉంటున్నాడు. ఈ క్రమంలో గ్రామంలోని ఓ ఎనిమిదేళ్ల బాలికపై ఉమాపతి కన్నేశాడు. అదునుకోసం కొన్ని రోజుల నుంచి ఆ కుటుంబాన్ని గమనిస్తూ ఉన్నాడు. ఒకరోజు ఇంటిముందు ఆడుకుంటున్న సమయంలో చుట్టుపక్కల ఎవరూ ఉండకపోవడంతో ఆ బాలికను దగ్గరలో ఉన్న సచివాలయంలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. బాలిక అరుపులు వినిపించి తల్లి అక్కడికి రావడంతో నిందితుడు పరారయ్యాడు. బాలికను అక్కడి నుండి ఇంటికి తీసుకువెళ్లిన తల్లి.. కుటుంబసభ్యుల సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు బాలికను వైద్య పరీక్షల నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేస్తామని తెలిపారు.