పోలీసు ఉద్యోగ పరీక్షలో దొడ్డిదారి యత్నం.. చివరికి ఏమైందంటే?

by Jakkula Mamatha |
పోలీసు ఉద్యోగ పరీక్షలో దొడ్డిదారి యత్నం.. చివరికి ఏమైందంటే?
X

దిశ, మంత్రాలయం రూరల్/కోసిగి: ఎలాగైనా పోలీసు ఉద్యోగం సాధించాలన్న పట్టుదలతో కొంతకాలంగా సాధన చేసి ఓ అభ్యర్థి ఛాతి, ఎత్తు కొలతలో ఫెయిల్ కావడంతో దొడ్డిదారిలో యత్నించి అడ్డంగా దొరికిపోయాడు. అధికారులను మోసగించే క్రమంలో అక్కడ సాంకేతికత ద్వారా గుర్తించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని 4వ పట్టణ పోలీసు స్టేషన్ లో చీటింగ్ కేసు నమోదు చేశారు. పోలీసు నియామక ప్రక్రియలో భాగంగా ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించిన కానిస్టేబుల్ ఉద్యోగాల ప్రాథమిక రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు కర్నూలు ఏపీఎస్.పీ బెటాలియన్ లో డిసెంబర్ 30 నుంచి దేహదారుడ్య పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా మంగళవారం కోసిగి మండల పరిధిలోని దొడ్డి బెలగల్ గ్రామానికి చెందిన పి.నరసింహుడు కుమారుడు పబిత తిరుమల బయోమెట్రిక్ కు హాజరయ్యారు.

అయితే.. అతను ఎత్తు, ఛాతి కొలతలో ఫెయిల్ కావడంతో వెనక్కి పంపారు. అయితే క్వాలిఫై అయినట్లు టిక్ మార్క్ వేసుకుని 1600 మీటర్ల పరుగులో పాల్గొనేందుకు వరుస క్రమంలో నిలబడి మోసగించేందుకు ప్రయత్నించగా.. స్టార్టింగ్ పాయింట్ బందోబస్తు డ్యూటీ లో రిజర్వ్ ఇన్స్పెక్టర్ నాగభూషణం గుర్తించి అభ్యర్థి మోసాన్ని వెలుగులోకి తెచ్చారు.పాడ్ క్యారియర్ లేకుండా 1600 మీటర్ల పాయింట్ వద్ద ఆర్ఎస్ఐడి రిజిస్ట్రేషన్ కంప్యూటర్ ఆపరేటర్ జయరాం దగ్గరకు వెళ్లి పరిశీలించగా.. సిస్టమ్ లో అభ్యర్థి పేరు చూపడం లేదని, హాల్ టికెట్ లో మాత్రం క్వాలిఫై అయినట్లు నకిలీ తయారు చేసి టిక్ మార్క్ వేసుకున్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఇదే విషయాన్ని ఎస్పీ బిందుమాధవ్ దృష్టికి తీసుకెళ్లాగా.. 4వ పట్టణ పోలీసులకు అప్పగించాలని ఆదేశించారు. ఈ మేరకు అభ్యర్థి పబిత తిరుమల పై చీటింగ్ కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపినట్లు ఎస్సై గోపీనాథ్ తెలిపారు..

Advertisement

Next Story

Most Viewed