- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
BREAKING: టీడీపీ శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన చంద్రబాబు.. ముక్తకంఠంతో ఆమోదం తెలిపిన టీడీపీ ఎమ్మెల్యేలు
![BREAKING: టీడీపీ శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన చంద్రబాబు.. ముక్తకంఠంతో ఆమోదం తెలిపిన టీడీపీ ఎమ్మెల్యేలు BREAKING: టీడీపీ శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన చంద్రబాబు.. ముక్తకంఠంతో ఆమోదం తెలిపిన టీడీపీ ఎమ్మెల్యేలు](https://www.dishadaily.com/h-upload/2024/06/11/342009-13.webp)
దిశ, వెబ్డెస్క్: ఏపీలో ప్రభుత్వ ఏర్పాటుకు తొలి అడుగు పడింది. విజయవాడలోని ఏ-కన్వెన్షన్ వేదికగా మంగళవారం జరుగుతోన్న కూటమి శాసనసభాపక్ష సమావేశం కాసేపటి క్రితం ప్రారంభమైంది. ముందుగా కూటమి మూడు పార్టీ అధినేతలైన చంద్రబాబు, పవన్, పురందేశ్వరి, ఎమ్మెల్యేలు అంతా వేదికపై ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం టీడీపీ శాసనసభాపక్ష నేతగా చంద్రబాబు పేరును ఆ పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రతిపాదించారు. దీంతో టీడీపీ ఎమ్మెల్యేలంతా తమ నాయకుడు చంద్రబాబేనని ముక్తకంఠంతో ఆమోదం తెలిపారు. అదేవిధంగా కూటమి తరఫున సీఎంగా చంద్రబాబు పేరును జనసన అధినేత, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కల్యాణ్ ప్రతిపాదించగా.. రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి, కూటమి ఎమ్మెల్యేలు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఇక ఏకగ్రీవ తీర్మానాన్ని కూటమి నేతలు సంయుక్తంగా గవర్నర్కు పంపనున్నారు. రాష్ట్రంలో నూతన ప్రభుత్వ ఏర్పాటు ఆహ్వానించాలని కోరనున్నారు.