Mangalagiri టీడీపీకి షాక్.. వైసీపీలోకి భారీగా వలసలు

by Disha Web Desk 16 |
Mangalagiri టీడీపీకి షాక్.. వైసీపీలోకి భారీగా వలసలు
X

దిశ మంగళగిరి: దుగ్గిరాల మండలం రేవెంద్రపాడు గ్రామ తెలుగుదేశం పార్టీకి చెందిన సుమారు 100 బీసీ గౌడ, ముస్లిం, ఇతర బీసి సామాజికవర్గానికి చెందిన కుటుంబాలు ఆ పార్టీని వీడి ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు , ఎమ్మెల్యే ఆర్కే‌ల సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం జగన్ సంక్షేమ పథకాలు, రాజకీయంగా బీసీలకు ఇస్తున్న ప్రోత్సాహానికి ఆకర్షితులై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో బీసీలకు సీఎం జగన్ వేస్తున్న పెద్దపీట చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు.

ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఎస్సీ, ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల సంక్షేమం, రాజకీయంగా వారి ఎదుగుదలకు బంగారు బాట నిర్మింపబడుతుందని పేర్కొన్నారు. బీసీలు అంటే వెనుకబడిన కులాలు కాదని బీసీలు అంటే వెన్నుముక లాంటి వారని నమ్మిన సిద్ధాంతం ప్రకారం ఈ రాష్ట్రంలో పరిపాలన నడుస్తుందని చెప్పారు. అనునిత్యం అణగారిన వర్గాల సంక్షేమం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాటుపడుతుందని అన్నారు.

ఇవి కూడా చదవండి:

Cm Jaganను ఫాలో అవుతున్న మాచర్ల ఎమ్మెల్యే.. తాజాగా సంచలన వ్యాఖ్యలు



Next Story

Most Viewed