- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
తల్లిదండ్రుల సాక్షిగా 2 సెంట్ల స్థలం ఇస్తా: మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి
![తల్లిదండ్రుల సాక్షిగా 2 సెంట్ల స్థలం ఇస్తా: మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి తల్లిదండ్రుల సాక్షిగా 2 సెంట్ల స్థలం ఇస్తా: మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి](https://www.dishadaily.com/h-upload/2024/02/26/311253-bji.webp)
దిశ, వెబ్ డెస్క్: మరో నెలల్లో రాష్ట్రంలో ఎన్నికలు ఉండటంతో రాజకీయ నేతలు ఎమ్మెల్యేగా గెలిచేందుకు హామీల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటివరకూ చేయలేని పనులను సైతం చేస్తామంటూ ఊదరగొడుతున్నారు. అంతేకాదు తల్లిదండ్రులపై ఒట్టేసి మరీ హామీలు ఇస్తున్నారు. ఈ కోవలోకి తాజాగా బనగాన పల్లె టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి చేరిపోయారు.
నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం కొండపేటలో అసంపూర్తిగా ఉన్న మసీద్ను సొంత డబ్బులతో నిర్మించారు. ఈ సందర్భంగా ఆయన ఎన్నికల హామీ ఇచ్చారు. బనగానపల్లెలోని పేదలకు తన సొంత డబ్బులతో 2 సెంట్ల స్థలం కొని ఇస్తానని హామీ ఇచ్చారు. అంతేకాదు తన తల్లిదండ్రుల సాక్షిగా మాట ఇస్తున్నాని ప్రజలకు చెప్పారు. కొందరు కావాలనే తనపై, తన కుటుంబంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆ ఆరోపణలు చేస్తున్న వారిని ఆ దేవుడే చూసుకుంటారని బీసీ జనార్దన్ రెడ్డి శపించారు.