Ap News: అంగన్‌వాడీలకు గుడ్ న్యూస్.. మంత్రి సంధ్యారాణి కీలక ప్రకటన

by srinivas |   ( Updated:2024-06-17 12:31:53.0  )
Ap News:  అంగన్‌వాడీలకు గుడ్ న్యూస్.. మంత్రి సంధ్యారాణి కీలక ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్: విజయనగరం జిల్లా సాలూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన గుమ్మిడి సంధ్యారాణి సోమవారం మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. కూటమి ప్రభుత్వం ఆమెకు మహిళా శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖను కేటాయించింది. దీంతో అమరావతిలోని సచివాలయంలో తన ఛాంబర్‌లో బాధ్యతలు చేపట్టారు. ఈ సంద్భంగా మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ అంగన్వాడీల సమస్యలపై కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వంలో అంగన్‌వాడీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని మండిపడ్డారు. తమ ప్రభుత్వంలో అంగన్వాడీల సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. గిరిజన స్కూళ్ల అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలిపారు. గిరిజన స్కూళ్లలో డ్రాప్ అవుట్లను త్వరగా నివారించేందుకు కృషి చేస్తామని చెప్పారు. గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో ఏఎన్ఎంలను నియమిస్తామని హామీ ఇచ్చారు. ఐటీడీఏ, ఐసీడీఎస్‌లోనూ ప్రక్షాళన చేపడతామని మంత్రి సంధ్యారాణి వ్యాఖ్యానించారు.

Advertisement

Next Story

Most Viewed