- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
ఓట్ల లెక్కింపుపై ఏపీ డీజీపీ కీలక నిర్ణయం.. 56 మంది ప్రత్యేక అధికారుల నియామకం
దిశ, వెబ్ డెస్క్: ఈ నెల 13న జరిగిన పోలింగ్ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అల్లర్లు చెలరేగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఓట్ల లెక్కింపుపై ఏపీ పోలీస్ శాఖ అప్రమత్తమైంది. అల్లర్లను దృష్టిలో ఉంచుకుని అన్ని జిల్లాలకు ప్రత్యేక పోలీస్ అధికారులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ డీజీపీ హరీష్ ఉత్తర్వుల ప్రకారం.. 56 మంది ప్రత్యేక పోలీసు అధికారులను నియమించారు.. ఇందులో అత్యధికంగా 8 మంది పోలీసు అధికారులను నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే ఓట్ల లెక్కింపు కేంద్రాల పరిసర ప్రాంతంలో కఠిన ఆంక్షలు అమలులో ఉంటాయని.. ఎవరైన అల్లర్లు సృష్టించాలని చూస్తే.. కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ తెలిపారు.
ఓట్ల లెక్కింపు కేంద్రాలు, ఆ కేంద్రంలో నిబంధనల మేర కు టేబుల్స్ ఏర్పాటు, పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు టేబుల్స్ ఏర్పాటుపై రాష్ట్ర ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా పలు సూచనలు చేశారు. ఎన్నికల పరిశీలకులు, అభ్యర్థుల సమక్షంలో పారదర్శకంగా ఓట్ల లెక్కింపు జరగాలన్నారు. ప్రతి అంశాన్ని వీడియోగ్రఫీ చిత్రీకరించాలని ఆయన సూచించారు. కాగా ఆంద్రప్రదేశ్ లోని 175 అసెంబ్లీ స్థానాలతో పాటు 25 పార్లమెంట్ స్థానాలకు ఒకే విడతలో.. నాలుగో దశలో పోలింగ్ జరిగింది. కాగా ఈ ఎన్నికల్లో అధికార వైసీపీ, ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ, జనసేన బీజేపీ ఎన్డీఏ కూటమి నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడుతున్నాయి.