- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
కౌంటింగ్ కేంద్రాల్లో త్వరితగతిన ఏర్పాట్లు చేపట్టాలి:జాయింట్ కలెక్టర్

దిశ ప్రతినిధి, అనంతపురం:సాధారణ ఎన్నికల దృష్ట్యా నగరంలోని జేఎన్టీయూ లో ఏర్పాటు చేస్తున్న కౌంటింగ్ కేంద్రాల్లో త్వరితగతిన అన్ని ఏర్పాట్లు చేపట్టాలని జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్ రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు.మంగళవారం అనంతపురం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో సాధారణ ఎన్నికలు - 2024 కోసం కౌంటింగ్ కేంద్రాల్లో ఏర్పాటు విషయమై సంబంధిత రిటర్నింగ్ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కౌంటింగ్ కేంద్రాల్లో పార్కింగ్, రిసెప్షన్ సెంటర్, స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ హాల్ మ్యాప్స్ సిద్ధం చేయాలన్నారు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు వెంటనే పూర్తి చేయాలని సూచించారు.ఈ సమావేశంలో డిఆర్ఓ జి.రామకృష్ణారెడ్డి, కలెక్టరేట్ కోఆర్డినేషన్ సెక్షన్ సూపరింటెండెంట్ రవికుమార్, ఆర్ ఓ జి.వెంకటేష్, వి.శ్రీనివాసులు రెడ్డి, రాంభూపాల్ రెడ్డి, కరుణకుమారి, వసంత బాబు, వెన్నెల శీను, సర్వేయర్లు, తదితరులు పాల్గొన్నారు.