- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
రాయలసీమపై మంత్రి సత్యకుమార్ ఫోకస్... నారా లోకేశ్కు లేఖ
by srinivas |

X
దిశ, వెబ్ డెస్క్: రాయలసీమలో మహిళా ఇంజినీరింగ్ కాలేజీని ఏర్పాటు చేయాలని మంత్రి సత్యకుమార్ అన్నారు. ఈ మేరకు మంత్రి నారా లోకేశ్కు ఆయన లేఖ రాశారు. మహిళలకు స్థిరమైన అభివృద్ధి అవకాశాలు కల్పించాలని కోరారు. అలాగే ధర్మవరంలో ప్రత్యేకంగా మహిళలకు ఇంజినీరింగ్ కాలేజ్ను ఏర్పాటు చేయాలని లేఖలో సత్యకుమార్ పేర్కొన్నారు. అంతర్జాతీయంగా చాలా సాంకేతిక అవకాశాలను అందిపుచ్చుకుని సీఎం చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అద్భుతాలు సాధించిందని తెలిపారు. ప్రస్తుతం మనం ఆర్టిఫియల్ ఇంటెలిజెన్స్ యుగంలో ఉన్నామని చెప్పారు. రాయలసీమ సామాజిక, ఆర్థిక పరిస్థితులపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించాలని మంత్రి సత్యకుమార్ విజ్ఞప్తి చేశారు.
Next Story