- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
Minister Payyavula Keshav:ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి

దిశ, ఉరవకొండ : రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన కోసం పటిష్టమైన ఏర్పాట్లు వేగవంతంగా చేపట్టాలని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఆదేశించారు. సీఎం చంద్రబాబు పర్యటన సందర్భంగా ఉరవకొండ నియోజకవర్గం వజ్రకరూరు మండలం ఛాయాపురం గ్రామం వద్ద ఏర్పాటు చేస్తున్న హెలిప్యాడ్, హెచ్ఎన్ఎస్ఎస్ కాలువ వెడల్పు పనులు, గ్రామ సభకు సంబంధించిన ఏర్పాట్లను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పరిశీలించారు. ఏర్పాట్లు ఎంతవరకు పూర్తయ్యాయి, తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యల గురించి అధికారులతో మంత్రి అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ.. ఈనెల 9వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హంద్రీనీవా కాలువ వెడల్పు చేసే పనులన్నింటిని పరిశీలించడానికి వస్తున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో ఎలాంటి లోటుపాట్లు, ఇబ్బందులు లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేపట్టాలన్నారు. హెలిప్యాడ్, హెచ్ఎన్ఎస్ఎస్ కాలువ, ప్రజావేదిక సభకు సంబంధించిన ఏర్పాట్లను వెంటనే పూర్తి చేయాలన్నారు. సభకు హాజరయ్యే వారికి ఇబ్బందులు లేకుండా చూడాలని, వాహనాల పార్కింగ్ కు సంబంధించి అన్ని ఏర్పాట్లు జాగ్రత్తగా చేయాలన్నారు. సీఎం చంద్రబాబు పర్యటనను విజయవంతం చేసేందుకు అన్ని రకాల ఏర్పాట్లు తక్షణమే పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సిఎంఓ కార్యాలయం అధికారులు, ఆయా శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.