Kalyanadurgam: గూభనపల్లిలో చిరుత సంచారం

by srinivas |
Kalyanadurgam: గూభనపల్లిలో చిరుత సంచారం
X

దిశ, కళ్యాణదుర్గం: కళ్యాణదుర్గం మండలం గూబనపల్లిలో చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది. ఆ గ్రామం గోశాల పరిసర ప్రాంతాల్లో రెండు చిరుత పులులు సంచరిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. దీంతో రైతులు పొలాల్లోకి వెళ్లేందుకు బిక్కు బిక్కుమంటున్నారు. ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని జీవిస్తున్నారు. ఈ విషయంపై అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఇప్పటికే చిరుతలు సంచరిస్తున్న ప్రాంతంలోకి ఎవరు వెళ్లకుండా జాగ్రత్త వహిస్తున్నారు.

Next Story