యువత అన్ని రంగాల్లో రాణించాలి: మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి

by srinivas |   ( Updated:2023-01-15 14:32:59.0  )
యువత అన్ని రంగాల్లో రాణించాలి: మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి
X

దిశ, అనంతపురం: ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా మడకశిర శివాపురం నందు అంతర్ జిల్లాల వాలీబాల్ టోర్నమెంట్‌ను మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి ప్రారంభించారు. ఈ సందర్భంగా గుండుమల తిప్పేస్వామి మాట్లాడుతూ యువత చేతుల్లోనే ఈ దేశ భవిష్యత్తు ఉందన్నారు. యువకులు బాధ్యతగా వ్యవహరించి క్రీడల్లోనే కాకుండా అన్ని రంగాల్లో రాణించాలని ఆయన సూచించారు. దేశ విదేశాల్లో భారతదేశ కీర్తి ప్రతిష్టలను పెంచే బాధ్యత యువత తీసుకోవాలన్నారు. భవిష్యత్తులో అన్ని రకాల క్రీడలకు ప్రోత్సాహం ఉంటుందని తిప్పేస్వామి తెలిపారు. ఈ కార్యక్రమంలో సత్య సాయిజిల్లా టీఎన్ఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు మురళి బాబు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed