Kalyadurgam: మధ్నాహ్న భోజనంపై కలెక్టర్ ఎం.గౌతమి కీలక వ్యాఖ్యలు

by srinivas |   ( Updated:2023-11-03 16:09:40.0  )
Kalyadurgam: మధ్నాహ్న భోజనంపై కలెక్టర్ ఎం.గౌతమి కీలక వ్యాఖ్యలు
X

దిశ, కళ్యాణదుర్గం: మెనూ ప్రకారం నాణ్యతగా మధ్యాహ్న భోజనం అందించాలని జిల్లా కలెక్టర్ ఎం.గౌతమి ఆదేశించారు. వజ్రకరూరు మండలంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో 6, 9 తరగతి విద్యార్థులకు జరుగుతున్న స్టేట్ ఎడ్యుకేషన్ అచీవ్మెంట్ సర్వీస్ పరీక్షలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మధ్యాహ్న భోజనాన్ని నాణ్యతగా అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఈఓ నాగరాజు, తహసిల్దార్ అనిల్ కుమార్, ఎంఈవోలు తిమ్మప్ప, ఎర్రిస్వామి, హెడ్మాస్టర్ కృష్ణనాయక్, తదితరులు పాల్గొన్నారు.

Next Story