- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
BREAKING: ఎన్నికల వేళ సంచలన ఘటన.. హోంమంత్రిపై దాడికి యత్నం..!
దిశ, వెబ్డెస్క్: ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి తానేటి వనితపై టీడీపీ కార్యకర్తలు దాడికి యత్నించారు. మంగళవారం రాత్రి హోంమంత్రి వనిత బస చేసిన ఇంటిపై టీడీపీ కార్యకర్తలు దాడి చేసినట్లు సమాచారం. ఈ దాడిలో పలువురికి గాయాలు కాగా వాహనాలు, ఫర్నీచర్ ధ్వంసమైంది. ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. కాగా, ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం రాత్రి తూర్పు గోదావరి జిల్లాలోని నల్లజర్లలో వనిత =ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలో వైసీపీ శ్రేణులు ఏర్పాటు చేసిన డీజేను టీడీపీ నేతలు అడ్డుకున్నారు. దీంతో టీడీపీ, వైసీపీ కార్యకర్తలకు వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రచారం ముగించుకుని తానేటి వనిత స్థానిక వైసీపీ నేత సుబ్రహ్మణ్యం ఇంటికి వెళ్లారు.
టీడీపీ అభ్యర్థి వెంకటరాజు, ముళ్లపూడి బాపిరాజు హోంమంత్రి వనిత బస చేస్తోన్న వైసీపీ నేత సుబ్రహ్మణ్యం ఇంటి వద్దకు చేరుకున్నారు. దీంతో అక్కడ టీడీపీ, వైసీపీ నేతల మధ్య మరోసారి తీవ్ర వాగ్వాదం, ఘర్షణ జరిగింది. ఈ దాడిలో పలువురు వైసీపీ నేతలకు గాయాలు అయ్యినట్లు తెలుస్తోంది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుండా భారీగా పోలీసులను మోహరించారు. ఇక, ఈ ఘటనపై హోంమంత్రి తానేటి వనిత స్పందించారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ నేతలకు ఓటమి భయం పట్టుకుందని ఫైర్ అయ్యారు. మా ప్రచారం చూసి ఓర్చుకోలేకపోయారని, మహిళను అని కూడా చూడకుండా దాడికి యత్నించారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వయంగా హోంమంత్రిపై టీడీపీ అభ్యర్థి దాడి చేయడమంటే అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నామా అనిపిస్తోందన్నారు.