మిర్చి రైతుల కష్టాలపై వ్యవసాయ శాఖ స్పందించాలి: చంద్రబాబు నాయుడు

by Disha Web Desk 12 |
మిర్చి రైతుల కష్టాలపై వ్యవసాయ శాఖ స్పందించాలి: చంద్రబాబు నాయుడు
X

దిశ, డైనమిక్ బ్యూరో: మిర్చి రైతులను వైసీపీ ప్రభుత్వం ఆదుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కోరారు. వరుసగా మిర్చి రైతు నష్టపోతున్నారని వారిని ఈ ఏడాదైనా అప్పులపాలవ్వకుండా తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బుధవారం ట్వీట్ చేశారు.'నల్ల తామర పురుగుతో మిర్చి రైతులు వరుసగా రెండో ఏడాది కూడా తీవ్రంగా నష్టపోతున్నారు. పంటను కాపాడుకునేందుకు రకరకాల మందుల వాడకం తో పెట్టుబడి రెట్టింపు అవుతుంది. పురుగుల మందుల ధరల నియంత్రణ పై వ్యవసాయ శాఖ దృష్టి పెట్టాలి. తామర పురుగు నివారణకు రైతులకు తగు సూచనలు ఇవ్వాలి' అని టీడీపీ అధినేత చంద్రబాబు ట్వీట్ చేశారు.

Also Read...

రేపు ఏపీలో సోమేష్ కుమార్ జాయినింగ్‌!


Next Story

Most Viewed